Vizag: జగన్‌పై దాడి కేసును సిట్‌కు అప్పగించనున్నాం: ఏసీపీ అర్జున్

  • దాడికి పాల్పడింది వైసీపీ అభిమానిగా తెలిసింది
  • పబ్లిసిటీ కోసమే దాడి
  • సెక్షన్ 307 కింద కేసు నమోదు

జగన్‌పై దాడి కేసుకు సంబంధించి కొన్ని కీలక విషయాలను విశాఖ వెస్ట్ జోన్ ఏసీపీ అర్జున్ వివరించారు. ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు జానిపల్లి శ్రీనివాసరావు వైసీపీ అభిమాని అని తెలిసిందన్నారు. పబ్లిసిటీ కోసమే శ్రీనివాసరావు ఈ దాడికి పాల్పడ్డాడని అర్జున్ వెల్లడించారు. అయితే ఈ కేసును సిట్‌కు అప్పగించనున్నట్టు ఆయన తెలిపారు. శ్రీనివాసరావుపై సెక్షన్ 307 కింద కేసు నమోదు చేసినట్టు అర్జున్ తెలిపారు. ప్రస్తుతం జగన్ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్‌లో చికిత్స తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

More Telugu News