ys jagan: జగన్ భుజానికి కుట్లు వేసిన వైద్యులు!

  • సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స
  • గాయమైన చోట కుట్లు వేయాలన్న వైద్యులు
  • కత్తిపై విషపదార్థాలు ఉన్నాయా? లేదా? అన్నది తేలేది పరీక్షల తర్వాత 

విశాఖ ఎయిర్ పోర్ట్ లో కత్తిపోటుకు గురైన వైసీపీ అధినేత జగన్ భుజానికి చికిత్స జరుగుతోంది. హైదరాబాద్ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. కాగా, జగన్ భుజానికి తగిలిన గాయానికి కుట్లు వేసినట్టు తెలుస్తోంది. జగన్ కు గాయమైన ప్రదేశంలో రక్తనమూనాలను పరిశీలించాల్సి ఉందని, కత్తిపై విషపదార్థాలు ఉన్నాయా? లేదా? అన్న విషయం పరీక్షల తర్వాత తేలే అవకాశం ఉందని సమాచారం.

More Telugu News