తొలిసారిగా రూ. కోటి దాటిన మంగళాద్రి పానకం వేలం!
- గణనీయంగా పెరుగుతున్న భక్తుల తాకిడి
- రూ. 1,08,09,999కు పానకం వేలం
- వచ్చే సంవత్సరం డిసెంబర్ 7 వరకూ హక్కులు
పానకంతో పాటు కొబ్బరికాయలు, దీపారాధనలు, పూజాద్రవ్యాలు, ఆధ్యాత్మిక పుస్తకాలు, ఫొటోలు తదితరాలను విక్రయించేందుకు కూడా వేలం నిర్వహించారు. గత సంవత్సరం రూ. 82.90 లక్షలకు హక్కులను విక్రయించిన అధికారులు, ఈ సంవత్సరం భారీ మొత్తాన్ని రాబట్టడంలో సఫలం కావడంతో భక్తులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే సంవత్సరం డిసెంబర్ 7 వరకూ ఈ హక్కులు చెల్లుబాటులో ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు.
కాగా, మంగళగిరిలో స్వయంభువుగా వేంచేసివున్న పానకాలస్వామి నోటిలో భక్తులు పానకం పోయడం ఆనవాయతీ. ఎంత పానకం పోసినా, అందులో సగభాగాన్ని స్వామి తీసుకుని, మిగతా భాగాన్ని భక్తులకు తిరిగి ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత.