kcr: ‘గ్యాంగ్ ఆఫ్ ఫోర్’ ఎంజాయ్ చేసేందుకే తెలంగాణ వచ్చినట్టుగా ఉంది!: ఉత్తమ్ ఫైర్

  • కేసీఆర్ కు బానిసలుగా ఉండాలా?  
  • ఉద్యమం కోసం కేసీఆర్, కేటీఆర్ చేసిందేమీ లేదు
  • ‘మహాకూటమి’తో వాళ్లు లాగులు తడుస్తున్నాయి

తెలంగాణలో ఎవరూ మాట్లాడొద్దు, అందరూ కేసీఆర్ బానిసలుగా ఉండాలా అంటూ టీ-పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిప్పులు చెరిగారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో ఉత్తమ్ మాట్లాడుతూ, ఈ ముదనష్టపు కేసీఆర్ పరిపాలనలో తెలంగాణలో ఎవరన్నా బాగుపడ్డారా? మొత్తం నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను తొక్కేసి.. ఆ నలుగురు.. గ్యాంగ్ ఆఫ్ ఫోర్ ఎంజాయ్ చేయడానికి తెలంగాణ వచ్చినట్టుగా కేసీఆర్ కుటుంబం భావిస్తోందంటూ మండిపడ్డారు.

 ప్రజల డబ్బులతో కోట్ల విలువ చేసే ఇల్లు కట్టుకున్నారని, వారు కొనుక్కొన్న ఒక్కొక్క కారు విలువ రూ.4 కోట్లని కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశారు. దోచుకుని, దాచుకున్న డబ్బుని వచ్చే ఎన్నికల్లో పంచి పెట్టి, మద్యం సరఫరా చేసి గెలవాలని కేసీఆర్ కుటుంబం చూస్తోందని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమం గురించి ప్రస్తావిస్తూ, ఈ ఉద్యమం కోసం కేసీఆర్, కేటీఆర్ చేసిందేమీ లేదని విమర్శించారు. మహాకూటమితో ముందుకెళ్తుంటే కేసీఆర్ కు, ఆయన కుటుంబసభ్యులకు లాగులు తడుస్తున్నాయని విమర్శించారు.

More Telugu News