Chandrababu: చంద్రబాబును కలిసి రూ. 25 లక్షల చెక్కును అందించిన బాలయ్య

  • తిత్లీ తుపానుకు తీవ్రంగా నష్టపోయిన శ్రీకాకుళం జిల్లా
  • రూ. 25 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన బాలయ్య
  • చంద్రబాబు నివాసానికి వెళ్లి చెక్కు అందజేత

తిత్లీ తుపాను బాధితుల సహాయార్థం హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ రూ. 25 లక్షల ఆర్థికసాయాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈరోజు చంద్రబాబు హైదరాబాదుకు వచ్చారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ లోని చంద్రబాబు నివాసానికి బాలయ్య వెళ్లారు. అనంతరం తుపాను బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రూ. 25 లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు. తిత్లీ తుపాను వల్ల శ్రీకాకుళం జిల్లాకు తీవ్ర నష్టం వాటిల్లిన సంగతి తెలిసిందే.  

More Telugu News