Sabarimala: మళ్లీ 40 ఏళ్ల తరువాత వస్తా... అయ్యప్ప సన్నిధిలో భక్తులను ఆకర్షించిన బాలిక!

  • ప్లకార్డును ప్రదర్శించిన తొమ్మిదేళ్ల బాలిక జనని
  • తండ్రితో కలసి సన్నిధానానికి వచ్చి స్వామిని దర్శించుకున్న బాలిక
  • ఆలయానికి మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్న సంప్రదాయవాదులు

"స్వామియే శరణం అయ్యప్ప... నా పేరు జనని. నాకిప్పుడు తొమ్మిదేళ్లు. నేను మళ్లీ శబరిమల సన్నిధానానికి 40 సంవత్సరాల తరువాత, నాకు 50 ఏళ్ల వయసు వచ్చినప్పుడు వస్తాను" అని రాసున్న ఓ ప్లకార్డును పట్టుకున్న బాలిక, శబరిమలకు వచ్చిన భక్తులను విశేషంగా ఆకర్షించింది. 10 నుంచి 50 సంవత్సరాల మధ్య వయసున్న మహిళలకు ఆలయంలో ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు తీర్పివ్వగా, అందుకు హిందూ సంఘాలు, సంప్రదాయవాదులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన తండ్రి, బంధువులతో కలసి సన్నిధానానికి వచ్చి స్వామిని దర్శించుకున్న జనని, ఇలా ప్లకార్డు పట్టుకుని నిలబడింది. ఆమె ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More Telugu News