Andhra Pradesh: చిత్తూరులో ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఏడుగురికి తీవ్ర గాయాలు!

  • ఈరోజు ఉదయం మిట్టకండ్రిగ వద్ద ఘటన
  • ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిన లారీ
  • ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్ల పరిస్థితి సీరియఎస్
చిత్తూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టడంతో బస్సు డ్రైవర్ సహా ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం, మిట్టకండ్రిగ వద్ద ఈ రోజు ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఏడుగురు ప్రయాణికులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇక ఈ యాక్సిడెంట్ లో గాయపడ్డ బస్సు, లారీ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Andhra Pradesh
Chittoor District
Road Accident
7 injured

More Telugu News