Telangana: గవర్నర్, కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

  • చెడుపై మంచి సాధించిన విజయమిది
  • ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలి
  • పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి

తెలుగు రాష్ట్రాల గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా విజయ దశమి పండుగను చేసుకుంటారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజలందరూ ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకోవాలని కోరారు.

More Telugu News