Telangana: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు సెలవుల పొడిగింపు.. 22న తిరిగి కాలేజీలు ప్రారంభం

  • తొలుత ఈ నెల 18 వరకు సెలవులు
  • గురు, శుక్రవారాల్లో దసరా జరుపుకుంటున్న ప్రజలు
  • అధికారుల విజ్ఞప్తి మేరకు సెలవుల్లో మార్పు

ఇంటర్మీడియట్ విద్యార్థుల సెలవులను మరో రెండు రోజులు పొడిగిస్తూ తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది. నిజానికి ఈ నెల 18 వరకు తొలుత సెలవులు ప్రకటించింది. ఇప్పుడు వాటిని ఈ నెల 20 వరకు పొడిగించింది. 21 ఆదివారం కావడంతో 22న తిరిగి కళాశాలలు ప్రారంభం అవుతాయని బోర్డు పేర్కొంది. దసరా పండుగను కొన్ని ప్రాంతాల్లో గురువారం, మరికొన్ని ప్రాంతాల్లో శుక్రవారం జరుపుకుంటుండడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అధికారులు, లెక్చరర్ల అభ్యర్థన మేరకు సెలవుల్లో మార్పులు చేసినట్టు బోర్డు అధికారులు తెలిపారు.

More Telugu News