Chandrababu: దసరా ఉత్సవాల కంటే దుర్గ గుడిలో వివాదాలే ప్రచారంలో కొస్తున్నాయి!: చంద్రబాబు ఫైర్

  • పార్టీ నాయకులు, పాలకమండలి అత్యుత్సాహం తగదు
  • తీరు మారకపోతే కఠిన నిర్ణయాలు తప్పవు
  • దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కు సీఎంఓ అధికారుల ఫోన్

దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడ కనకదుర్గమ్మ వారికి టీటీడీ పట్టువస్త్రాల సమర్పణ వివాదాస్పదమైన విషయం తెలిసిందే. టీటీడీ బోర్డు సభ్యుడు, విజయవాడ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు తనను పట్టించుకోలేదంటూ అలిగివెళ్లిపోవడం, దుర్గగుడి ఈవో, పాలక మండలి మధ్య వివాదం తలెత్తడం పలు విమర్శలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా ఉత్సవాల కంటే ఆలయంలో వివాదాలే ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయని మండిపడ్డారు.

పార్టీ నాయకులు, పాలకమండలి అత్యుత్సాహం ప్రదర్శించడం తగదని, తీరు మారకపోతే కఠిన నిర్ణయాలు తప్పవని హెచ్చరించారు. ఈ విషయాన్ని దుర్గగుడి పాలకమండలి చైర్మన్ కు ముఖ్యమంత్రి కార్యాలయం అధికారులు ఫోన్ చేసి చెప్పారు. ఆలయంలో వివాదాలకు ఆస్కారం లేకుండా చూడాలని, అధికారులతో సమన్వయంగా పని చేయాలని చైర్మన్ కు సూచించినట్టు సమాచారం.

More Telugu News