Karnataka: భర్త ఉండగానే ఇద్దరితో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ.. గొంతు కోసి పరారైన ప్రియుడు!

  • కర్ణాటకలోని బెళత్తూరులో ఘటన
  • వీధిలో వెళుతుండగా వెంబడించి దాడి
  • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు

ఓ వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని, మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటున్న ఓ మహిళ దారుణ హత్యకు గురయింది. ఈ ఘటన కర్ణాటకలోని బెళత్తూరులో చోటుచేసుకుంది. బెంగళూరుకు సమీపంలోని బెళత్తూరులో మంజుల అనే వివాహిత ఉంటోంది. ఆమెకు భర్త మంజునాథ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో మంజులకు ఆటో డ్రైవర్ రాజశేఖర్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఇటీవలి కాలంలో మంజుల స్థానికంగా ఉండే సురేశ్ తో చనువుగా ఉంటోంది.

ఈ విషయం తెలుసుకున్న ప్రియుడు రాజశేఖర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. నిన్న సాయంత్రం రోడ్డుపై వెళుతుండగా ఆమెను అడ్డగించాడు. వెంట తెచ్చుకున్న కత్తితో మంజుల కడుపులో పొడిచాడు. అనంతరం గొంతు కోసి ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు బాధితురాలిని హోసూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడి ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News