Mahesh Babu: భారీ రేటుకు 'మహర్షి' శాటిలైట్ హక్కులు

  • మహేశ్ 25వ మూవీగా 'మహర్షి'
  • సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ 
  • ఏప్రిల్ 5వ తేదీన విడుదల

మహేశ్ బాబు కథానాయకుడిగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో 'మహర్షి' సినిమా రూపొందుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, విదేశాల్లోనే ఎక్కువభాగం చిత్రీకరణను జరుపుకుంటోంది. మహేశ్ కి ఇది 25వ సినిమా కావడంతో, అభిమానుల్లో అంచనాలు భారీగా వుండే అవకాశం వుంది. అందువలన వంశీ పైడిపల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.

ఈ సినిమాకి గల క్రేజ్ కారణంగా శాటిలైట్ హక్కులకు గట్టిపోటీ ఏర్పడింది. ఫ్యాన్సీ రేటుగా పెద్ద మొత్తం చెల్లించి శాటిలైట్ హక్కులను జెమినీ టీవీవారు సొంతం చేసుకున్నారు. ఈ విషయాన్ని సదరు ఛానెల్ అధికారికంగా ధ్రువీకరించింది. అల్లరి నరేశ్ ముఖ్యమైన పాత్రను పోషిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఏప్రిల్ 5వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు

  • Loading...

More Telugu News