Pawan Kalyan: పవన్ కల్యాణ్ కు ఫోన్ చేసిన కేటీఆర్

  • జనసేన కవాతును విజయవంతంగా నిర్వహించినందుకు అభినందనలు తెలిపిన కేటీఆర్
  • ధన్యవాదాలు తెలిపిన పవన్ కల్యాణ్
  • కాంగ్రెస్ నేతలు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేశారన్న కేటీఆర్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు తెలంగాణ మంత్రి కేటీఆర్ ఫోన్ చేశారు. రాజమండ్రి సమీపంలోని ధవళేశ్వరం బ్యారేజీపై జనసేన నిర్వహించిన కవాతు విజయవంతం కావడంపై ఈ సందర్భంగా పవన్ ను కేటీఆర్ అభినందించారు. కేటీఆర్ కు ఈ సందర్భంగా పవన్ ధన్యవాదాలు తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్ నేతలపై కేటీఆర్ మండిపడ్డారు. 2006 నుంచి 2014 వరకు తెలంగాణ కోసం తాను పోరాడానని... ఈ సమయంలో కాంగ్రెస్ నేతలంతా ఎక్కడున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేయడంలో కాంగ్రెస్ నేతలు బిజీగా ఉన్నారని చెప్పారు.

More Telugu News