Keerti: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

  • బయోపిక్ లు చేయనంటున్నకీర్తి!
  • పిరీడ్ డ్రామా చేయనున్న మహేశ్
  • సెన్సార్ పూర్తి చేసుకున్న 'పందెం కోడి 2'    

*  'ఇకపై బయోపిక్ లు చేయకూడదని నిర్ణయించుకున్నాను' అంటోంది కీర్తి సురేశ్. 'మహానటి ఒక మేజిక్. మళ్లీ సావిత్రి పాత్రను చేయమన్నా అలా చేయలేను. అది అలా జరిగిపోయిందంతే. అందుకే ఆ పాత్రను మళ్లీ ముట్టుకోకూడదనుకున్నా. ఈ కారణం వల్లే ఎన్టీఆర్ బయోపిక్ చేయలేదు. అసలు ఇకపై ఏ బయోపిక్ కూడా చేయకూడదని నిర్ణయించుకున్నాను' అని చెప్పింది కీర్తి.
*  ప్రస్తుతం చేస్తున్న 'మహర్షి' చిత్రం తర్వాత మహేశ్ బాబు తదుపరి చిత్రాన్ని సుకుమార్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ చిత్రం పిరీడ్ డ్రామాగా రూపొందుతుందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన స్క్రిప్ట్ పని ప్రస్తుతం జరుగుతోంది.
*  విశాల్ హీరోగా నటించిన 'పందెం కోడి 2' చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీనికి సెన్సార్ నుంచి U/A సర్టిఫికేట్ లభించింది. కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని విజయదశమి సందర్భంగా రేపు విడుదల చేస్తున్నారు.

More Telugu News