goa: గోవాలో కాంగ్రెస్ కు షాక్.. బీజేపీలో చేరిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

  • ఢిల్లీలో గోవా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 
  • అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేలు
  • మరో ఇద్దరు, ముగ్గురు కూడా చేరుతారని వెల్లడి

గోవాలో కాంగ్రెస్ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి... బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరారు. దయానంద్ సోప్టే, సుభాష్ శిరోద్కర్ లు నిన్న రాత్రి గోవా నుంచి ఢిల్లీకి బయల్దేరారు. వారిద్దరూ పార్టీ మారబోతున్నారనే ప్రచారం ఓ వైపు జరుగుతున్నప్పటికీ... తమ ప్రయాణం సంగతిని కూడా వారు గోప్యంగానే ఉంచారు. అమిత్ షాను కలిసేంత వరకు వారు బీజేపీలో చేరుతున్నట్టు ఎవరికీ తెలియదు. అమిత్ షాను కలిసిన అనంతరం వారు మాట్లాడుతూ, మరో ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా త్వరలోనే బీజేపీలో చేరుతారని చెప్పారు.

గోవా నుంచి ఢిల్లీ బయల్దేరే ముందు వీరిని రిపోర్టర్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా దయానంద్ మాట్లాడుతూ, బిజినెస్ పని మీదే తాను ఢిల్లీ వెళ్తున్నానని చెప్పారు. సుభాష్ మాట్లాడుతూ, బీజేపీలో చేరడానికి తాను ఢిల్లీకి వెళ్లడం లేదని... తాను బీజేపీలో చేరితే ఆ విషయం మీకు చెబుతానని తెలిపారు.

More Telugu News