sabarimala: శబరిమలలో ఉద్రిక్తత.. బేస్ క్యాంప్ కు చేరుకున్న మహిళలు

  • రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయ తలుపులు
  • ఆలయంలోకి వెళ్లేందుకు ఇప్పటికే అక్కడకు చేరుకున్న మహిళలు
  • ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించిన నిరసనకారులు

శబరిమల  ఆలయంలోకి మహిళలు వెళ్లవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కేరళ అట్టుడుకుతోంది. రేపు శబరిమల ఆలయం తలుపులు తెరుచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆలయంలోకి ప్రవేశించేందుకు బేస్ క్యాంప్ వద్దకు మహిళలు చేరుకున్నారు. మహిళల ప్రవేశాన్ని అడ్డుకునేందుకు భారీ సంఖ్యలో మహిళా నిరసనకారులు అక్కడకు చేరుకున్నారు. మహిళలను ఆలయంలోకి అనుమతిస్తే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. తాజా పరిస్థితులపై చర్చించడానికి ట్రావెన్ కోర్ దేవాలయం సమావేశమయింది. మరోవైపు, సుప్రీం తీర్పుపై రివిజన్ పిటిషన్ వేయబోమని కేరళ సీఎం పినరయి విజయన్ స్పష్టం చేశారు.

More Telugu News