ntr bhavan: ఎన్టీఆర్ భవన్ లో ‘ఎల్లో ఆర్మీ తెలంగాణ’ యాప్ ఆవిష్కరణ

  • తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండటానికి కారణం టీడీపీయే
  • కేసీఆర్ పాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు జేశారు
  • కేసీఆర్ ను ఎన్టీఆర్, ఇందిరాగాంధీతో పోల్చడం హాస్యాస్పదం

హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో ‘ఎల్లో ఆర్మీ తెలంగాణ’ యాప్ ను టీ-టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎల్.రమణ మాట్లాడుతూ, ఎన్నికల్లో విజయం కోసం కార్యకర్తలందరూ ఏకతాటిపై పని చేసేందుకే ఈ యాప్ ను తీసుకొచ్చినట్టు చెప్పారు. తెలంగాణలో మహాకూటమి జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ధనిక రాష్ట్రంగా ఉండటానికి కారణం టీడీపీయేనని అన్నారు. కేసీఆర్ తన పాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పులపాలు జేశారని విమర్శించారు. కేసీఆర్ ను ఎన్టీఆర్, ఇందిరాగాంధీతో పోల్చడం హాస్యాస్పదమని అన్నారు. కాగా, టీడీపీ పరిరక్షణకు ఈ యాప్ అవసరముందని, దీని ద్వారా పార్టీకి పూర్వవైభవం రావాలని సీనియర్ నేత పెద్దిరెడ్డి ఆకాంక్షించారు.  

More Telugu News