TRS: టీఆర్ఎస్ లోని అగ్రనేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు: మధు యాష్కీ

  • ఈ చేరికలపై ఏవిధంగా ముందుకెళ్లాలో చర్చించాం
  • దుర్మార్గపు పాలన అంతం చేసేందుకే ‘మహాకూటమి’
  • కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న యాష్కీ

టీఆర్ఎస్ లోని అగ్రనేతలు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకునేందుకు సిద్ధంగా ఉన్నారని టీ-కాంగ్రెస్ నేత మధు యాష్కీ చెప్పారు. హైదరాబాద్ లోని గోల్కొండ హోటల్ లో ఈరోజు కాంగ్రెస్ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ, రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ నేతలు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో పాల్గొన్న మధుయాష్కీ మాట్లాడుతూ, టీఆర్ఎస్ అగ్రనేతలు కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ చేరికలపై ఏ విధంగా ముందుకు వెళ్లాలనే అంశంపై చర్చించినట్టు చెప్పారు. తెలంగాణలో కేసీఆర్ దుర్మార్గపు పాలనను అంతం చేయాలన్న ప్రధాన ఉద్దేశంతోనే ‘మహాకూటమి’ ఏర్పడిందని అన్నారు. ఈ నెల 20న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారని చెప్పారు. మహాకూటమి సీట్ల సర్దుబాటు అజెండాతో ఈ సమావేశం ముగిసినట్టు సమాచారం. 

More Telugu News