స్టీల్ ప్లాంట్ డిమాండుతో.. కేంద్ర మంత్రితో భేటీ అయిన టీడీపీ ఎంపీలు

  • బీరేంద్ర సింగ్ ను కలిసిన టీడీపీ ఎంపీలు
  • కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని వినతి
  • అంతకు ముందు సుజనా చౌదరి నివాసంలో భేటీ
కడపలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు కోసం టీడీపీ ఎంపీలు తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలో ఈ ఉదయం కేంద్ర మంత్రి బీరేంద్ర సింగ్ ను వారు కలిశారు. కడపలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశానికి ముందు సుజనాచౌదరి నివాసంలో వీరంతా భేటీ అయ్యారు. కేంద్ర మంత్రితో భేటీ సందర్భంగా ఆయన ముందు ఐదు డిమాండ్లు ఉంచినట్టు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Go Back to Shorts
Telugudesam MP
beerendra singh
kadapa
steel plant

More Telugu News