Andhra Pradesh: కిడారి, సోమల హత్యలో పాల్గొన్న మావోయిస్టు మీనా ఎన్ కౌంటర్!

  • ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో ఘటన
  • నలుగురిని అదుపులోకి తీసుకున్న బలగాలు
  • విశాఖ మన్యంలో ఇద్దరిని హతమార్చిన మావోలు

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, సివేరి సోమలను హత్య చేసిన ఘటనలో పాల్గొన్న మీనాను పోలీసులు ఈ రోజు ఎన్ కౌంటర్ లో హతమార్చారు. ఆంధ్రా-ఒడిశా బోర్డర్ లో ఉన్న బెజ్జింకి ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా బలగాలకు మావోలు తారసపడ్డారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కాల్పులు చోటుచేసుకున్నాయి.

ఈ సందర్భంగా మావోలను అన్ని వైపుల నుంచి చుట్టుముట్టిన బలగాలు కాల్పులు జరపడంతో మీనా ప్రాణాలు కోల్పోయింది. చనిపోయిన మీనాను గాజర్ల రవి అలియాస్ గణేశ్ భార్యగా పోలీసులు గుర్తించారు. ఆమె స్వస్థలం వరంగల్ అని చెప్పారు. కాగా,  ఈ ఎన్ కౌంటర్ లో జయంతి, రాధిక, గీత, రాజశేఖర్ అనే మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.

More Telugu News