Babli: చంద్రబాబు కేసు కోసం ధర్మాబాద్ కు వచ్చిన సుప్రీంకోర్టు న్యాయవాది!

  • పదేళ్ల క్రితం బాబ్లీ వద్ద నిరసనలు
  • చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ వారంట్
  • రీకాల్ పిటిషన్ పై నేడు విచారణ

దాదాపు పది సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని బాబ్లీ ప్రాజెక్టు సమీపంలో నిరసనలు తెలిపిన చంద్రబాబుపై నమోదైన కేసులో, ఆయన తరఫున వాదనలు వినిపించేందుకు సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా ధర్మాబాద్ చేరుకున్నారు. ఈ కేసులో విచారణకు హాజరు కాకపోవడంతో, చంద్రబాబుపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారంట్ ను జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనపై ఉన్న వారంట్ ను రీకాల్ చేయాలని చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్ నేడు విచారణకు రానుంది.  

More Telugu News