TRS: వేరే పార్టీల సీట్ల పంపకాలు తేలేలోపే మా వాళ్లు స్వీట్లు పంచుకునేలా ఉన్నారు: కేటీఆర్

  • టీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా రాబోతోంది
  • ‘పేద ప్రజల సంక్షేమం.. తెలంగాణ అభివృద్ధి’ అనే థీమ్ 
  • ‘ఫిర్ ఏక్ బార్ కేసీఆర్’ అనే నినాదంతో మేనిఫెస్టో 

బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాకు చేతనైతే తెలంగాణకు కేంద్రం ఇచ్చిన హామీలను తొమ్మిది నెలల్లోగా నెరవేర్చే ప్రయత్నం చేయాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. వేములవాడలో ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, చేతనైతే ఇచ్చిన హామీలు నెరవేర్చాలి తప్ప, రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్న వారిపై ఆరోపణలు, విమర్శలు చేయొద్దని అమిత్ షాకు హితవు పలికారు.

ఇప్పటికే తమ పార్టీ అభ్యర్థులు 105 మందిని ప్రకటించామని, మిగిలిన 14 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉందని అన్నారు. అభ్యర్థుల ఎంపిక విషయంలో వేరే పార్టీలు ఇంకా కిందామీదా పడుతున్నాయని, వాళ్ల సీట్ల పంపకాలు తేలే లోపే మా టీఆర్ఎస్ వాళ్లు స్వీట్లు పంచుకునేట్టు ఉన్నారని చమత్కరించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా రాబోతోందని, ‘పేద ప్రజల సంక్షేమం.. తెలంగాణ అభివృద్ధి’ అనే థీమ్ లో ‘ఫిర్ ఏక్ బార్ కేసీఆర్’ అనే నినాదంతో ఈ మేనిఫెస్టో ఉంటుందని చెప్పారు.  

More Telugu News