KTR: దేవుడ్ని కూడా మోసం చేసిన పార్టీ మీది: అమిత్ షాపై కేటీఆర్ ఫైర్

  • భావోద్వేగాలు రెచ్చగొట్టి మతాల మధ్య  చిచ్చుపెట్టారు
  • ఆ చిచ్చులో చలికాచుకున్నారు
  • బీజేపీ కంటే ఎక్కువగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నది టీఆర్ఎస్

మనుషులను మోసం చేసిన పార్టీలున్నాయి కానీ, దేవుడ్ని కూడా మోసం చేసిన పార్టీ బీజేపీయేనని, అందులో ఎటువంటి అనుమానం లేదంటూ అమిత్ షా పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వేములవాడలో ఈరోజు మీడియాతో మాట్లాడుతూ, ‘భావోద్వేగాలు రెచ్చగొట్టి, మతాల మధ్య చిచ్చుపెట్టి, ఆ చిచ్చులో చలికాచుకున్నారు. మీరు రామమందిరం కట్టలేదు కానీ, మేము మాత్రం కొత్తగా యాదాద్రి కడుతున్నాం. వేములవాడను అభివృద్ధి చేస్తున్నాం.

హిందుత్వ పార్టీగా చెప్పుకునే బీజేపీ కంటే ఎక్కువగా హిందూ ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వమే. కేవలం, హైందవమే కాదు, ఈ రాష్ట్రం సెక్యులర్ రాష్ట్రం. ఎవరికి ఏ మత విశ్వాసం ఉంటే వారికి అనుగుణంగా ఉంటూ, అందరినీ గౌరవంగా చూసుకుంటూ ఈ దేశం మొత్తానికి ఆదర్శంగా నిలబడ్డది తెలంగాణ రాష్ట్రం. ఇలాంటి రాష్ట్ర ముఖ్యమంత్రి మీదా నీ అసమర్థ ప్రేలాపనలు..?’ అంటూ అమిత్ షా పై కేటీఆర్ నిప్పులు చెరిగారు.

More Telugu News