Virat Kohli: అన్నపూర్ణ స్టూడియోస్ లో విరాట్ కోహ్లీ.. అఖిల్ తో ముచ్చట్లు!

  • ఓ ప్రకటన చిత్రీకరణ నిమిత్తం స్టూడియోకు వెళ్లిన కోహ్లీ?
  • ఎల్లుండి నుంచి భారత్-వెస్టిండీస్ రెండో టెస్టు మ్యాచ్
  • నిన్ననే హైదరాబాద్ చేరుకున్న రెండు జట్లు

భారత్-వెస్టిండీస్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఎల్లుండి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు నిన్ననే హైదరాబాద్ చేరుకున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తన సతీమణి అనుష్కశర్మతో కలిసి ఇక్కడికి చేరుకున్నారు.

ఈ సందర్భంగా కోహ్లీ అన్నపూర్ణ స్టూడియోస్ కు వెళ్లారు. కాగా, స్టూడియోలో అఖిల్ అక్కినేనితో కలిసి కోహ్లీ ముచ్చటిస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాలకు చేరాయి. ఇదిలా ఉండగా, కోహ్లీపై ఓ వాణిజ్య ప్రకటన చిత్రీకరించనున్న నేపథ్యంలోనే స్టూడియోకు వెళ్లినట్టు సంబంధిత వర్గాల సమాచారం. 

More Telugu News