jaipalreddy: ఆ ఆరోపణలపై మంత్రి అక్బర్ వివరణ ఇవ్వాలి లేదా రాజీనామా చేయాలి: జైపాల్ రెడ్డి

  • అక్బర్ పై మహిళా జర్నలిస్టు ప్రియా రమణి ఆరోపణలు
  • దీనిపై దర్యాప్తు చేపట్టాలి
  • మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించాలి

‘మీ టూ’ ఉద్యమం ఊపందుకున్న నేపథ్యంలో మహిళా జర్నలిస్టు ప్రియారమణి తనకు జరిగిన అన్యాయంపై ఇటీవల ఓ ట్వీట్ చేసింది. విదేశాంగ సహాయమంత్రి, మాజీ జర్నలిస్టు ఎంజె అక్బర్ తనను లైంగికంగా వేధించారని ఆమె ఆరోపణలు చేసింది. ఈ అంశంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి స్పందించారు.

 ఢిల్లీలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఈ ఆరోపణలపై ఎంజే అక్బర్ వివరణ ఇవ్వాలి లేదా తన పదవికి రాజీనామా అయినా చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టాలని, ఈ విషయమై మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించాలని డిమాండ్ చేశారు. 

More Telugu News