koratala: చిరూ సినిమాకి ఒక నిర్మాతగా కొరటాల?

  • 'సైరా'తో బిజీగా చిరంజీవి 
  • తదుపరి సినిమా కొరటాలతో
  • వరుస హిట్లతో వున్న కొరటాల  

ప్రస్తుతం చిరంజీవి కథానాయకుడిగా 'సైరా' రూపొందుతోంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమా తరువాత ఆయన కొరటాల దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన పనుల్లోనే కొరటాల బిజీగా వున్నాడు. ఈ సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనున్నాడని అంటున్నారు.

ఈ సినిమా నిర్మాణంలో కొరటాల భాగస్వామి కానున్నాడని చెబుతున్నారు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మించనున్నారు. ఈ బ్యానర్లో కొరటాల తాను కూడా భాగస్వామిగా వుండనున్నాడని అంటున్నారు. ఇంతవరకూ కొరటాల తెరకెక్కించిన సినిమాలన్నీ భారీ వసూళ్లను రాబడుతూ విజయాలను అందుకున్నాయి. దాంతో కొరటాల నిర్మాతగాను రంగంలోకి దిగుతున్నాడని చెప్పుకుంటున్నారు. 

More Telugu News