collywood: డైరెక్ట్‌ తెలుగు చిత్రంతో త్వరలో మీ ముందుకు వస్తా!: తమిళ హీరో శింబు

  • మణిరత్నం ‘నవాబ్‌’తో అలరించిన శింబు 
  • తెలుగు ప్రేక్షకుల కోసం ఓ వీడియో విడుదల
  • నా డబ్బింగ్‌ చిత్రాలు ఆదరిస్తున్న మీ అందరికీ కృతజ్ఞతలు

పలు డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన కోలీవుడ్‌ హీరో శింబు.. తాజాగా ‘నవాబ్‌’ సినిమాతో ప్రేక్షుల ముందుకు వచ్చాడు. ఈ సందర్భంగా శింబు తన మనసులో మాట బయట పెట్టాడు. తనకు నేరుగా ఓ తెలుగు చిత్రంలో నటించాలనుందని తెలిపాడు. త్వరలో ఓ చిత్రం ద్వారా మీ ముందుకు వస్తున్నట్లు స్పష్టం చేశాడు.

ఇటీవల విడుదలైన మణిరత్నం సినిమా ‘నవాబ్‌’తో టాలీవుడ్‌ ప్రేక్షకుల్లోనూ అభిమానుల సంఖ్యను పెంచుకున్న ఈ హీరో వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓ వీడియో విడుదల చేశాడు. ‘మీ అందరి ఆదరణ లభిస్తుండడం నా అదృష్టం. నా చిత్రాలను ఆదరిస్తున్న మీ అందరికీ నా కృతజ్ఞతలు’ అని ఆ వీడియోలో పేర్కొన్నాడు. ప్రస్తుతం శింబు ‘అత్తారింటికి దారేది’ చిత్రం తమిళ రీమేక్‌లో నటిస్తున్నాడు.

More Telugu News