akhil: 'మిస్టర్ మజ్ను' రిలీజ్ డేట్ మారినట్టే!

  • అఖిల్ హీరోగా 'మిస్టర్ మజ్ను'
  • రొమాంటిక్ లవ్ స్టోరీగా సాగే కథ 
  • విదేశాల్లో జరుగుతోన్న షూటింగ్

అఖిల్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'మిస్టర్ మజ్ను' సినిమా రూపొందుతోంది. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే కొంతవరకూ షూటింగ్ జరుపుకుంది. కథ ప్రకారం ఈ రొమాంటిక్ లవ్ స్టోరీని విదేశాల్లోనే ఎక్కువగా చిత్రీకరిస్తున్నారు. ముందుగా ఈ సినిమాను డిసెంబర్లో విడుదల చేయాలనుకున్నారు.

కానీ ఆ సమయంలో పోటీ ఎక్కువగా వుండటంతో జనవరి 26వ తేదీన రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనుకోకుండా ఆ తేదీకి రెండు రోజుల ముందు 'ఎన్టీఆర్ మహానాయకుడు' థియేటర్లలోకి వచ్చేస్తోంది. దాంతో 'మిస్టర్ మజ్ను' విడుదల తేదీని వాయిదా వేసినట్టుగా సమాచారం. ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయడం కలిసొస్తుందనే ఆలోచన చేస్తున్నారట. దాదాపుగా ఇదే తేదీ ఖరారు కావొచ్చనే టాక్ ఫిల్మ్ నగర్లో బలంగా వినిపిస్తోంది.   

  • Loading...

More Telugu News