హ్యాకింగ్ కు గురైన బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేస్ బుక్ ఖాతా
- కుట్రపూరితంగా హ్యాక్ చేశారన్న రాజాసింగ్
- ఎంఐఎం నేతల కుట్ర ఉంది
- నన్ను ఓడించేందుకు అన్ని పార్టీలు యత్నిస్తున్నాయి
తెలంగాణలోనే కాకుండా దేశ వ్యాప్తంగా తనకు 5 లక్షలకు పైగా ఫాలోయర్లు ఉన్నారని చెప్పారు. ఈ నెల 2వ తేదీన హ్యాకింగ్ చేసేందుకు ఒకసారి ప్రయత్నించి విఫలమయ్యారని... నిన్న హ్యాక్ చేశారని మండిపడ్డారు. ఈ ఘటన వెనుక ఎంఐఎం నేతలు ఉన్నారని ఆరోపించారు. గోషామహల్ స్థానంలో తనను ఓడించేందుకు అన్ని పార్టీలు యత్నిస్తున్నాయని... ఎవరు ఎన్ని కుట్రలు చేసినా తాను ఘన విజయం సాధించడం ఖాయమని చెప్పారు.