kaushal: ఆ ముగ్గురు పార్టిసిపెంట్స్ కి చాలా బద్ధకం: కౌశల్

  • ఆ ముగ్గురూ బాగా గురకపెట్టేవారు 
  • ఈ ముగ్గురూ చాలా బద్ధకిస్టులు
  • ముందుగానే నిద్రపోయేవాడిని

'బిగ్ బాస్ 2'తో కౌశల్ బాగా పాప్యులర్ అయ్యాడు. బిగ్ బాస్ హౌస్ లోని మిగతావాళ్లతో ఢీ అంటే ఢీ అంటూనే ఆయన టైటిల్ తెచ్చేసుకున్నాడు. అలాంటి కౌశల్ తాజాగా 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో మాట్లాడుతూ, 'బిగ్ బాస్ హౌస్'లో తన అనుభవాలను గురించి ప్రస్తావించాడు.

 'బిగ్ బాస్ హౌస్'లో గణేశ్ .. రోల్ రైడా .. బాబు గోగినేని బాగా గురకపెట్టేవారు. గణేశ్ నా పక్కనే పడుకునేవాడు .. 70 రోజుల పాటు భరించాను. వాళ్ల గురక కారణంగా నిద్రపట్టదేమోనని వాళ్ల కంటే ముందుగా నిద్రలోకి జారుకునేవాడిని. తెల్లవారిన తరువాత సాంగ్ ప్లే చేస్తారు. అప్పుడు లేవకపోతే కుక్కలు అరుస్తాయి" అని చెప్పారు.

ఈ షోలో అందరి కంటే బద్ధకిస్టులు ఎవరు? అనే ప్రశ్నకి సమాధానంగా ఆయన దీప్తి సునయన .. గీతామాధురి .. గణేశ్ పేర్లు చెప్పాడు. మూడుసార్లు సాంగ్ ప్లే చేస్తే .. నాలుగు మార్లు కుక్కలు అరిస్తేనే గాని వాళ్లు లేవరు" అని చెప్పుకొచ్చాడు.      

  • Loading...

More Telugu News