nana patekar: పదేళ్ల క్రితమే చెప్పా, ఈ ఆరోపణలు అబద్ధమని!: నానాపటేకర్

  • ఈరోజు జోథ్ పూర్ వెళ్లిన నానాపటేకర్
  • నానాను చుట్టుముట్టిన మీడియా
  • మైకులను పక్కను తోసేసిన వైనం

బాలీవుడ్ నటుడు నానా పటేకర్ తనతో అసభ్యకరంగా ప్రవర్తించారని నటి తనుశ్రీ దత్తా ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు జోథ్ పూర్ వెళ్లేందుకు ముంబయి విమానాశ్రయానికి వెళ్లిన నానా పటేకర్ ను విలేకరులు చుట్టుముట్టారు. ఈ ఆరోపణల విషయమై ప్రశ్నించారు.

దీనికి స్పందిస్తూ, ‘పదేళ్ల క్రితమే చెప్పాను.. ఇది అబద్ధం’ అని నానా పటేకర్ సమాధానిమిచ్చారు. మరిన్ని ప్రశ్నలు వేసేందుకు మీడియా ప్రతినిధులు యత్నించగా.. సున్నితంగా తిరస్కరిస్తూ.. టీవీ చానెళ్ళ మైకులను పక్కకు తోసేశారు. తనపై వచ్చిన ఈ ఆరోపణలపై మాట్లాడేందుకు ఈ నెల 8న ప్రత్యేక మీడియా సమావేశాన్ని నానాపటేకర్ నిర్వహిస్తారని బాలీవుడ్ వర్గాల సమాచారం.

More Telugu News