కాంగ్రెస్కు మరో ఎదురు దెబ్బ.. షాక్ ఇచ్చిన టీఎంసీ!
- బీఎస్పీ బాటలోనే టీఎంసీ
- కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేదిలేదన్న చందన్ మిత్రా
- ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేసే అవసరం లేదు
ఓ జాతీయ మీడియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న టీఎంసీ నేత చందన్ మిత్రా... తాము పశ్చిమ్బెంగాల్ లో వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో కలిసి పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో మోదీ-షా, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా బరిలోకి దిగడానికి మమతా బెనర్జీ కాంగ్రెస్తో కలిసి పనిచేస్తారా? అన్న ప్రశ్నకు చందన్ మిత్రా సమాధానం ఇస్తూ... ‘పశ్చిమ్ బంగాలో భాజపా, వామపక్ష పార్టీలకు వ్యతిరేక శక్తిగా మమతా బెనర్జీ మాత్రమే ఉన్నారు. కాంగ్రెస్తో పాటు ఏ పార్టీతోనూ కలిసి పోటీ చేసే అవసరం ఆమెకు లేదని అనుకుంటున్నాను’ అని అన్నారు. ఈసారి పశ్చిమ్ బెంగాల్ లో అత్యధిక సీట్లు సాధించాలని భావిస్తున్న బీజేపీకి ఇది కలిసొచ్చే అంశంగా పరిణమిస్తోంది.