raj tarun: మొత్తానికి రాజ్ తరుణ్ తో రెడీ అవుతున్నాడు

  • రాజ్ తరుణ్ హీరోగా కొత్త ప్రాజెక్టు 
  • దర్శకుడిగా మల్లిడి వేణు 
  • నిర్మాతగా సాయిరామ్ బాబ్జి  

తెలుగు తెరకు వరుసగా కొత్త దర్శకులు పరిచయమవుతున్నారు. టాలెంట్ వున్న వాళ్లు తొలి సినిమాతోనే సక్సెస్ ను అందుకుని, పెద్ద హీరోలతో ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే దర్శకుడిగా పరిచయం కావడానికి మల్లిడి వేణు కొంతకాలంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. నితిన్ తో ఒక ప్రాజెక్టును పట్టాలెక్కించడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు.

ఇక అల్లు శిరీష్ ను ఒప్పించడానికి కూడా తనవంతు కృషి చేశాడు గానీ, చివరి నిమిషంలో ఆ అవకాశం కూడా చేజారిపోయింది. దాంతో రాజ్ తరుణ్ పై దృష్టి పెట్టాడు. మల్లిడి వేణు వినిపించిన లైన్ నచ్చడంతో రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. ఇద్దరూ కలిసి స్క్రిప్ట్ పై గట్టిగానే కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వున్నారు. సీనియర్ డిస్ట్రిబ్యూటర్ సాయిరామ్ బాబ్జి ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తుండటం విశేషం.    

  • Loading...

More Telugu News