Jana Sena: ధవళేశ్వరం బ్యారేజీపై జన సైనికుల కవాతు.. వివరాలు ప్రకటించిన జనసేన పార్టీ!

  • ఈనెల 15న కవాతుకు ఏర్పాట్లు
  • కార్యకర్తలు భారీగా వస్తారని అంచనా
  • చురుగ్గా ఏర్పాట్లు చేస్తున్న పార్టీ నేతలు

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 15న ధవళేశ్వరం బ్రిడ్జిపై జన సైనికుల కవాతు నిర్వహిస్తామని జనసేన పార్టీ ప్రకటించింది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ తో పాటు లక్షలాది మంది జనసైనికులు పాల్గొంటారని వెల్లడించింది.

తొలుత ఈ యాత్రను రాజమహేంద్రవరం (రాజమండ్రి)లోని పాత బ్రిడ్జిపై ఈ నెల 2న నిర్వహించాలని భావించినప్పటికీ, కార్యకర్తలు చేరుకునేందుకు వీలుగా కార్యక్రమాన్ని వాయిదా వేశారు. తాజాగా ఈ నెల 15న జనసైనికుల కవాతు నిర్వహించేందుకు పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ ట్విట్టర్ లో ప్రకటించింది.

  • Loading...

More Telugu News