Navin Das: ఆమ్ ఆద్మీ నేత కారులో వెళుతుంటే... సజీవ దహనం చేసిన ప్రత్యర్థులు!

  • యూపీలోని బోప్రా సమీపంలో ఘటన
  • కారుకు లాక్ వేసి నిప్పంటించినట్టు అనుమానం
  • ప్రత్యర్థుల పనేనన్న నవీన్ దాస్ కుటుంబ సభ్యులు

ఆమ్ ఆద్మీ పార్టీ నేత, యూపీకి చెందిన నవీన్ దాస్ (25)ను ప్రత్యర్థులు సజీవదహనం చేశారు. బోప్రా ప్రాంతంలోని సహీదాబాద్ రోడ్డులో ఆయన తన కారులో ప్రయాణిస్తున్న వేళ ఈ ఘటన జరిగింది. ఆయన్ను ఓ పథకం ప్రకారం కారులో ఎక్కించి, బయటి నుంచి లాక్ చేసి నిప్పంటించి వుంటారని తెలుస్తోంది.

రోడ్డుపై ఓ కారు నుంచి మంటలు వస్తుండటాన్ని గమనించిన కొందరు ప్రజలు, పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు వచ్చేలోపే లోపలున్న వ్యక్తి మృతిచెందాడు. కారు నంబర్ ఆధారంగా, అతన్ని నవీన్ దాస్ గా గుర్తించారు. తన సోదరుడు రాజకీయంగా ఎదుగుతూ ఉండటంతో ఓర్చుకోలేని ప్రత్యర్థులు ఈ హత్యకు పాల్పడ్డారని సవీన్ సోదరి ఆరోపించారు. కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. నవీన్ కుటుంబాన్ని ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ పరామర్శించారు.

More Telugu News