దాడులకు వస్తున్న ఐటీ అధికారులకు భద్రత కల్పించకూడదని ఏపీ కేబినెట్ నిర్ణయం

  • సోదాలకు వచ్చిన ఐటీ అధికారులకు పోలీసు భద్రతకు నో
  • నేడు అడ్వకేట్ జనరల్‌తో సమావేశం
  • ఒకే సామాజిక వర్గం లక్ష్యంగా దాడులు
శుక్రవారం రాత్రి నిర్వహించిన ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీలో సోదాలు నిర్వహిస్తున్న ఐటీ అధికారులకు  పోలీసు భద్రత కల్పించకూడదని కేబినెట్ నిర్ణయించింది. అయితే, న్యాయశాఖ కార్యదర్శి సలహా తీసుకున్న తర్వాత ఈ విషయంలో ముందుకెళ్లాలని మంత్రులు ఓ అభిప్రాయానికి వచ్చారు. దీంతో ఈ విషయంలో నేడు అడ్వకేట్ జనరల్‌తో సమావేశం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయించారు. ఏపీపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దాడులు జరుగుతున్నాయని మంత్రులు అభిప్రాయపడ్డారు. ఒకే సామాజిక వర్గం లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని, కేంద్రంపై అన్ని స్థాయుల్లోనూ పోరాడాలని కేబినెట్ నిర్ణయించింది.
Go Back to Shorts
Andhra Pradesh
IT
Amaravathi
Police
Protection
Chandrababu
Cabinet meet

More Telugu News