విమానంలో ప్రయాణికుడికి గుండెపోటు.. ఆసుపత్రికి తరలించే లోపే మృతి!
- బ్యాంకాక్ నుంచి ఢిల్లీ వస్తున్న విమానంలో ఘటన
- మార్గమధ్యంలో గుండెపోటుకు గురైన 53 ఏళ్ల అటబోట్
- వారణాసిలో విమానం అత్యవసర ల్యాండింగ్
విషయం తెలిసిన వెంటనే అప్రమత్తమైన విమాన సిబ్బంది వెంటనే సమీపంలోని లాల్ బహదూర్ శాస్త్రి అంతర్జాతీయ విమానాశ్రయం సిబ్బందికి సమాచారం ఇచ్చి వారణాసిలో విమానాన్ని దించేశారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న సిబ్బంది అటబోట్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఆయనను పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆయన మృతి చెందినట్టు తెలిపారు. అటబోట్తో ప్రయాణిస్తున్న వారిలో ఆయన భార్య, సోదరితోపాటు మరో ఏడుగురు కుటుంబ సభ్యులు కూడా ఉన్నట్టు విమాన సిబ్బంది తెలిపారు. అటబోట్ మృతిపై భారత్లోని థాయ్లాండ్ రాయబార కార్యాలయానికి సమాచారం అందించినట్టు అధికారులు తెలిపారు.