karne prabhakar: ఉద్యమంలో భాగంగానే అప్పుడు చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాం: కర్నె ప్రభాకర్

  • చంద్రబాబు కట్టించిన హైటెక్ సిటీ గబ్బిలాల భవనంలా మారింది
  • ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులకు తెలంగాణలో ఏం పని?
  • కేసీఆర్ ప్రసంగాలతో కాంగ్రెస్ నేతల కింద భూమి కదులుతోంది

తెలంగాణ ఉద్యమంలో భాగంగానే గతంలో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ అన్నారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు చేత కేంద్రానికి లేఖ రాయించామని చెప్పారు. చంద్రబాబు నిర్మించిన హైటెక్ సిటీ... ఇప్పుడు గబ్బిలాల భవనంలా మారిందని విమర్శించారు. ఏపీ ఇంటెలిజెన్స్ అధికారులకు తెలంగాణలో ఏం పనని, తమ ఫోన్లను ఎందుకు ట్యాప్ చేస్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రసంగాలతో కాంగ్రెస్ నేతల కింద భూమి కదులుతోందని చెప్పారు. ఆడబిడ్డలకు బతుకమ్మ చీరలు కూడా పంచకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు.

More Telugu News