andhra jyothy: ‘ఆంధ్రజ్యోతి’ని ‘అబద్ధాల జ్యోతి’గా మార్చిన రాధాకృష్ణ: కన్నా లక్ష్మీనారాయణ

  • బీజేపీ-వైసీపీకి పొత్తు కుదిరిందనడాన్ని ఖండిస్తున్నా  
  • ఆధారాలు లేకుండా అసత్యాలతో నిండి వుంది
  •  పగటి కలలు కంటూ రాసినట్టుంది

బీజేపీ-వైసీపీకి పొత్తు కుదిరిందంటూ ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఈరోజు ప్రచురితమైన వార్తా కథనాన్ని ఖండిస్తున్నానని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో కన్నా ఓ పోస్ట్ చేశారు. ‘ఆంధ్రజ్యోతి’ని  ‘అబద్ధాల జ్యోతి’గా మార్చిన రాధాకృష్ణ.. అన్న శీర్షికతో కన్నా ఈ పోస్టును రాశారు. ఆధారాలు లేకుండా అసత్యాలతో, ఊహాగానాలతో నిండి ఉన్న ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని.. ఈ కథనం మొత్తంగా పగటి కలలు కంటూ రాసినట్టు అనిపిస్తోందని విమర్శించారు. పత్రికారంగంలో ఎంతో అనుభవమున్న మీ నుంచి ఇది ఊహించలేదని ఆంధ్రజ్యోతి, మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణను ఉద్దేశించి కన్నాఈ వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News