వైయస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు.. జగన్ సీఎం కాలేరు: పరిటాల సునీత
- జగన్ పాదయాత్రకే పరిమితమవుతారు
- ఎంతో మంది ఆడపడుచుల పసుపుకుంకుమలను వైయస్ తుడిచేశారు
- హంద్రీనీవా ప్రాజెక్టును వైయస్ ఎందుకు పూర్తి చేయలేదు?
వైయస్ హయాంలో రాయలసీమలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని సునీత విమర్శించారు. దివంగత్ ఎన్టీఆర్ ప్రారంభించిన హంద్రీనీవా ప్రాజెక్టును వైయస్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక హంద్రీనీవా ద్వారా రాయలసీమను సస్యశ్యామలం చేస్తున్నామని చెప్పారు. ఇవాళ సీమ మొత్తం పచ్చటి పంటలతో కళకళలాడుతోందని అన్నారు.