kcr: కేసీఆర్ పొత్తు పెట్టుకుంటే కరెక్టు.. మేము పెట్టుకుంటే తప్పా?: బండ్ల గణేష్

  • మహాకూటమి 104 స్థానాల్లో గెలుస్తుంది
  • ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం ఇది
  • టీఆర్ఎస్ వైఫల్యాలే కాంగ్రెస్ ను గెలిపిస్తాయి

రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి 104 స్థానాల్లో గెలవడం సాధ్యమని కాంగ్రెస్ నేత, సినీ నటుడు బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలే కాంగ్రెస్ ను గెలిపిస్తాయని చెప్పారు. ఈ ఎన్నికలు తల్లి బీజేపీ, పిల్ల బీజేపీ (టీఆర్ఎస్)కి - కాంగ్రెస్ పార్టీకి మధ్య జరుగుతున్న యుధ్దమని అన్నారు.

గతంలో కాంగ్రెస్, టీడీపీలతో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని... టీడీపీతో వారు పొత్తు పెట్టుకుంటే కరెక్టు... కాంగ్రెస్ పెట్టుకుంటే తప్పా? అని మండిపడ్డారు. ధర్మానికి, అధర్మానికి మధ్య జరుగుతున్న ఈ సంగ్రామంలో ధర్మానిదే విజయమని చెప్పారు. అలంపూర్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

More Telugu News