samrat: నా దృష్టిలో 'బిగ్ బాస్ 2' విజేత గీతా మాధురి: సామ్రాట్

  • తేజస్వీతో చనువును అపార్థం చేసుకున్నారు
  • నానితో తనీశ్ ఎక్కువ చీవాట్లను తిన్నాడు 
  • కౌశల్ పై నాకు ఎలాంటి కోపం లేదు 

'బిగ్ బాస్ 2' నుంచి తొలి ఫైనలిస్టుగా సామ్రాట్ ఎంపికయ్యాడు. టాప్ 5లో నుంచి ముందుగా బయటికి వచ్చింది కూడా ఆయనే. తాజాగా ఆయన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, 'బిగ్ బాస్ 2' గురించి తన మనోభావాలను ఆవిష్కరించాడు. ఈ షోలోకి నేను అడుగు పెట్టినప్పుడు .. ఈయనను ఎందుకు తీసుకున్నారు? అని హౌస్ లోని కొంతమంది అనుకున్నారు.

తనీశ్ తో ఉన్నట్టుగానే నేను తేజస్వీతో చనువుగా వున్నాను. తను అమ్మాయి కనుక కొంతమంది అపార్థం చేసుకున్నారు. ఇక నానిగారితో ఎక్కువగా చీవాట్లు తిన్నది తనీశ్ అని నా అభిప్రాయం. కౌశల్ గురించి చెప్పాలంటే తను చాలా క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. 'కుక్కల్లా మీద పడుతున్నారు' అని ఆయన అన్నప్పుడు చాలా బాధ కలిగింది. ఆయన పట్ల నాకు ఎలాంటి కోపం లేదు. కౌశల్ టైటిల్ ను గెలుచుకోవడం నాకు సంతోషమే .. కాకపోతే నా దృష్టిలో 'బిగ్ బాస్ 2' విజేత గీతామాధురి" అని చెప్పుకొచ్చాడు.  

      

More Telugu News