kcr: తెలంగాణకు కాపలా కుక్కనన్న కేసీఆర్ ఇప్పుడు కాటేసే నక్కలా మారాడు: మధుయాష్కి

  • కేసీఆర్ వి బట్టేబాజ్ మాటలు
  • మోదీకి కేసీఆర్ గులాంగా మారాడు
  • ముందస్తు ఎన్నికలు కేసీఆర్ కు భస్మాసుర హస్తమే

‘తెలంగాణకు కాపలా కుక్క’ని అన్న కేసీఆర్ ఇప్పుడు కాటేసే నక్కలా మారాడని టీ-కాంగ్రెస్ నేత మధుయాష్కి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని మోదీకి కేసీఆర్ గులాంగా మారాడని, కేసీఆర్ వి బట్టేబాజ్ మాటలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ భవంతులకు జాగా దొరుకుతుంది కానీ, పేదల ఇళ్లకు దొరకదని విమర్శించారు.

తెలంగాణ భవిష్యత్ కోసమే మహాకూటమిని ఏర్పాటు చేశామని మధుయాష్కి చెప్పారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలు కేసీఆర్ కు భస్మాసుర హస్తమేనని, టీఆర్ఎస్ కు మద్దతిస్తే అధికారులు జైలు కెళ్లడం ఖాయమని హెచ్చరించారు. గతంలో అమరావతి వెళ్లిన కేసీఆర్, చంద్రబాబుకు వంగి సలాం కొట్టింది నిజం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధిని ఆంధ్రావాళ్లు అడ్డుకున్నారని విమర్శించిన కేసీఆర్.. దళితులకు మూడెకరాల భూమి, సీఎం పదవి ఎందుకివ్వలేదని, వారికి ఇవ్వకుండా ఆంధ్రావాళ్లు అడ్డుకున్నారా? అని సెటైర్లు వేశారు. నిజామాబాద్ ఎంపీ కవితపైనా మధుయాష్కీ ఆరోపణలు గుప్పించారు. ‘జాగృతి’ పేరిట కవిత చేసిన వసూళ్లేవి? అని ప్రశ్నించారు.

More Telugu News