Balakrishna: రెండు భాగాలుగానే 'ఎన్టీఆర్' బయోపిక్?

  • షూటింగు దశలో 'ఎన్టీఆర్' బయోపిక్ 
  • ప్రధానమైన పాత్రల్లో ముఖ్య తారాగణం 
  • బాలయ్యతో చర్చించిన క్రిష్  

'ఎన్టీఆర్' బయోపిక్ ను మొదలు పెట్టేటప్పుడు .. ఈ సినిమా రెండు భాగాలుగా రానుందనే వార్తలు వచ్చాయి. ఆ తరువాత మళ్లీ ఆ ప్రస్తావన ఎక్కడా కనిపించలేదు. కానీ ఇప్పుడు మళ్లీ అదే టాక్ వినిపిస్తోంది. క్రిష్ దర్శకత్వంలో ఈ సినిమా చకచకా షూటింగు జరుపుకుంటోంది. చంద్రబాబు నాయుడి పాత్రలో రానా .. అక్కినేని నాగేశ్వర రావు పాత్రలో సుమంత్ .. శ్రీదేవి పాత్రలో రకుల్ నటిస్తున్నారు.

ఇలా ఈ సినిమాకి సంబంధించి ముఖ్యమైన తారాగణం పెరిగిపోతూ వస్తోంది. ఈ నేపథ్యంలో రెండున్నర గంటల్లో 'ఎన్టీఆర్ ' కథను చెప్పడం కష్టమేననే విషయం క్రిష్ కి స్పష్టమైపోయిందట. ఒకవేళ రెండున్నర గంటల్లోనే అవ్వగొట్టేద్దాం అనుకుంటే అభిమానులు నిరాశ చెందే అవకాశాలు ఎక్కువ అని భావిస్తున్నాడట. తాజాగా ఈ విషయం గురించి బాలకృష్ణతో చర్చించిన ఆయన, రెండు భాగాలుగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా సమాచారం. 

More Telugu News