IT RAIDS: రేవంత్ రెడ్డిపై ఐటీ దాడుల కేసు.. విచారణకు హాజరైన కొండల్ రెడ్డి, ఉదయసింహా!

  • ఐఆర్ఎస్ భవన్ కు చేరుకున్న నేతలు
  • మధ్యాహ్నం 3 కల్లా హాజరుకానున్న సెబాస్టియన్
  • సీబీఐ విచారణకు హాజరైన సెబాస్టియన్, సండ్ర, రేవంత్

రేవంత్ రెడ్డి ఇంటిపై ఆదాయపు పన్ను(ఐటీ) దాడుల కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న రేవంత్ తమ్ముడు కొండల్ రెడ్డి, ఉదయసింహాలు ఈ రోజు ఐటీ అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. అలాగే మరో నిందితుడు సెబాస్టియన్ ను మధ్యాహ్నం 3 గంటల్లోగా హాజరుకావాలని ఐటీ అధికారులు ఆదేశించారు. ఈ కేసులో విచారణకు రావాలని ఐటీ శాఖ ఇప్పటికే వీరికి నోటీసులు జారీచేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఐఆర్ఎస్ భవన్ లో ఈరోజు జరిగిన విచారణకు కొండల్ రెడ్డి, ఉదయసింహాలు హాజరయ్యారు. ఓటుకు నోటు కేసులో సెబాస్టియన్ ఏసీబీ కోర్టులో ఈ రోజు విచారణకు హాజరయ్యారు. కోర్టు విచారణ ముగిశాక సెబాస్టియన్ ఐటీ విచారణకు హాజరయ్యే అవకాశముందని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

  • Loading...

More Telugu News