Mumbai: బాలీవుడ్ భామ నేహా ధూపియాకు సీమంతం... సందడి చేసిన జాన్వి, సోనాక్షి!

  • ముంబైలో వైభవంగా నేహా ధూపియా సీమంతం
  • హాజరైన బాలీవుడ్ సెలబ్రిటీలు
  • సోషల్ మీడియాలో పోస్టులు

కొన్నేళ్ల క్రితం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన 'పరమ వీర చక్ర' సినిమా గుర్తుందా? ఆ చిత్రంలో బాలయ్య సరసన ఆడి పాడిన నేహా ధూపియా, ఇటీవల అంగద్ బేడీని వివాహం చేసుకోగా, ప్రస్తుతం ఆమె గర్భవతి. నేహా ధూపియా సీమంతం ముంబైలో అంగరంగ వైభవంగా జరుగగా, పలువురు సినీ ప్రముఖులు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫొటోలను కరీనాకపూర్, సోహా అలీఖాన్ తదితరులు తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్టు చేశారు. నేహా ధూపియా సీమంతానికి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్, సోనాక్షీ సిన్హా, హుమా ఖురేషి, కరణ్ జోహార్ తదితరులు హాజరై సందడి చేశారు.

  • Loading...

More Telugu News