Chandrababu: రాజధాని పేరుతో చంద్రబాబు భూదందా చేస్తున్నారు: కన్నా లక్ష్మీనారాయణ

  • ప్రజల నుంచి వసూలు చేసిన విరాళాలేమయ్యాయో?
  • కేంద్ర నిధులతో నాలుగు భవనాలు కూడా నిర్మించలేదు
  • చంద్రబాబు, లోకేశ్ లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు

రాజధాని పేరుతో చంద్రబాబు భూదందా చేస్తున్నారని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. కేంద్రం రూ.2,500 కోట్లు ఇస్తే నాలుగు భవనాలు కూడా నిర్మించలేదని, రాజధాని అభివృద్ధి కోసం ఏపీ ప్రజలు రూ.11 వేల కోట్లు కట్టారని, ప్రజల నుంచి వసూలు చేసిన విరాళాలు ఏమయ్యాయో చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేశ్ లు రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఏపీలో టీడీపీ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు దక్కుతున్నాయని ఆరోపించారు.

అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి కేంద్రం పుణ్యమే

ఏపీలో చంద్రబాబు అధర్మపోరాటం చేస్తున్నారని, బీజేపీని చంద్రబాబు, లోకేశ్ లు లక్ష్యంగా చేసుకోవడానికి కారణం వారి అసమర్థ పాలనేనని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ విమర్శించారు. అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్రం పుణ్యమేనని, డిజైన్ల మార్పు పేరిట అభివృద్ధి పనులను చంద్రబాబు అడ్డుకుంటున్నారని అన్నారు.

More Telugu News