KCR: ఎదుర్కొనే దమ్ము లేకనే... కేసులు పెట్టిస్తున్న కేసీఆర్: డీకే అరుణ నిప్పులు

  • కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తే కేసులు
  • రేవంత్ ఇంటికి వచ్చి మద్దతు తెలిపిన డీకే అరుణ
  • బుద్ధి చెప్పే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్య

టీఆర్‌ఎస్‌ అసమర్థ పాలనను, కేసీఆర్ అవినీతిని ప్రశ్నించిన కాంగ్రెస్ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని కాంగ్రెస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ నిప్పులు చెరిగారు. ఈ ఉదయం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆమె, రేవంత్ రెడ్డి, ఆయన బంధువుల ఇళ్లపై గత రెండు రోజులుగా జరుగుతున్న దాడులపై స్పందించారు. కాంగ్రెస్ నేతలను ఎదుర్కొనే దమ్ము లేకనే, కేసీఆర్ కేసులు పెట్టిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ఈ ఉదయం జూబ్లిహిల్స్‌ లోని రేవంత్‌ రెడ్డి ఇంటికి వెళ్లిన డీకే అరుణ, ఆయనకు మద్దతు పలికారు. తప్పుడు కేసులతో కక్ష సాధింపు చర్యలకు దిగుతున్న టీఆర్ఎస్ నేతలకు బుద్ధి చెప్పేరోజు త్వరలోనే రానుందని ఆమె జోస్యం చెప్పారు.

More Telugu News