chennai: ఆశ్లీల వీడియోలు తీసి భార్యనే బ్లాక్‌మెయిల్‌ చేసిన ప్రబుద్ధుడు!

  • సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తానని బెదిరింపులు
  • అదనపు కట్నం కోసం బరితెగింపు
  • భర్తతోపాటు నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు

దంపతుల వ్యక్తిగత జీవితానికే పరిమితమైన పడకగది దృశ్యాలను తన సాధనంగా మార్చుకుని భార్యనే బ్లాక్‌ మెయిల్‌ చేసే స్థాయికి దిగజారాడో ప్రబుద్ధుడు. అదనపు కట్నం తేవాలని, లేదంటే ఆశ్లీల దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. చెన్నైకి చెందిన ముబారక్‌ అహ్మద్‌ సోదరుడు సంగమ్‌షేక్‌ దౌత్‌ వ్యాపారపరంగా ఉగాండా దేశంలో స్థిరపడ్డాడు. ఇతను తన కుమార్తె సంగమ్‌హస్మీని మధురై అళగప్పన్‌నగర్‌ బందరు వీధికి చెందిన అల్లావుద్దీన్‌ ఆసిక్‌కిచ్చి గత జనవరిలో వివాహం జరిపించాడు.

పెళ్లి సమయంలో 140 సవర్ల బంగారం, కారు కట్నంగా ఇచ్చాడు. అల్లుడు వ్యాపారం చేసుకుంటానంటే 25 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశాడు. అయినా అదనపు కట్నం కోసం అల్లావుద్దీన్‌ భార్యను వేధించడం మొదలు పెట్టాడు. ఇది చాలదన్నట్టు భార్య ఆశ్లీల వీడియోలు తీసి కట్నం తేకుంటే వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో సంగమ్‌హస్మి ఉగాండాలోని పుట్టింటికి వెళ్లిపోయి తన వేదన వెల్లడించింది. దీంతో సంగమ్‌షేక్‌ చెన్నైలోని తన సోదరుడి సాయంతో అక్కడి పోలీసులకు అల్లుడిపై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అల్లావుద్డీన్‌తోపాటు అతని తల్లిదండ్రులు, సోదరుడిపై కేసు నమోదుచేసి విచారణ జరుపుతున్నారు.

More Telugu News