nagashaurya: గీతా ఆర్ట్స్ నుంచి మరో రొమాంటిక్ ఎంటర్టైనర్

  • భారీ లాభాలు తెచ్చిపెట్టిన 'గీత గోవిందం'
  • మరో ప్రేమకథకు శ్రీకారం 
  • త్వరలోనే కథానాయిక ఎంపిక  

ఇటీవల గీతా ఆర్ట్స్ నుంచి వచ్చిన 'గీత గోవిందం' చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. కొత్త కోణంలో ఆవిష్కరించబడిన ఈ ప్రేమకథా చిత్రం సరికొత్త ట్రెండ్ ను సృష్టించింది. చాలా తక్కువ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా, భారీ లాభాలను తెచ్చిపెట్టింది. దాంతో మరో రొమాంటిక్ ఎంటర్టైనర్ ను నిర్మించడానికి గీతా ఆర్ట్స్ వారు రెడీ అవుతున్నారు.

ఈ సినిమాలో కథానాయకుడిగా నాగశౌర్యను ఎంపిక చేసుకున్నారు. కథానాయిక ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. తక్కువ బడ్జెట్ లోనే చేసే ఈ సినిమాను ఓ యువదర్శకుడికి అప్పగించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కథా చర్చలు చివరి దశకి చేరుకున్నాయనీ, త్వరలోనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.   

More Telugu News